రామభద్రరాజుకు అయ్యన్న నివాళి

ABN, First Publish Date - 2023-06-11T00:14:45+05:30

అనారోగ్యంతో మృతిచెందిన ఏటికొప్పాక సుగర్‌ ఫ్యాక్టరీ చైర్మన్‌ రాజాసాగి రామభద్రరాజు కుటుంబ సభ్యులను టీడీపీ పొలిటీబ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు పరామర్శించారు.

రామభద్రరాజుకు అయ్యన్న నివాళి
ప్యాక్టరీ మాజీ చైర్మన్‌ రామభ్రదరాజు చిత్రపటానికి నివాళి అర్పించి అయ్యన్న పాత్రుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటవురట్ల, జూన్‌ 10: అనారోగ్యంతో మృతిచెందిన ఏటికొప్పాక సుగర్‌ ఫ్యాక్టరీ చైర్మన్‌ రాజాసాగి రామభద్రరాజు కుటుంబ సభ్యులను టీడీపీ పొలిటీబ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు పరామర్శించారు. శనివారం మండలంలోని తంగేడు గ్రామానికి వెళ్లి రామభద్రరాజు కుమారుడిని, కుటుంబసభ్యులతో అయ్యన్న మాట్లాడారు. అనంతరం రామభద్రరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్‌ రామచంద్రరాజు (చంటిబాబు) తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T00:14:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising