ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పిల్లల ముందు పెళ్లాల పంచాయితీ సిగ్గు చేటు..

ABN, First Publish Date - 2023-06-29T14:55:42+05:30

పార్వతీపురం: నిన్న కురుపాంలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంపై మన్యం జిల్లా టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి గురువారం మీడియాతో మాట్లాడుతూ జిల్లా సమస్యలు గాలికొదిలేసిన సీఎం జగన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం: నిన్న కురుపాంలో ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ప్రసంగంపై మన్యం జిల్లా టీడీపీ నేతలు (TDP Leaders) మండిపడ్డారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి (SandhyaRani) గురువారం మీడియాతో మాట్లాడుతూ జిల్లా సమస్యలు గాలికొదిలేసిన సీఎం జగన్.. పిల్లల ముందు పెళ్లాల పంచాయితీ పెట్టడం సిగ్గు చేటన్నారు. గిరిజనుల గోడు ఇంత వరకు అసలు ముఖ్యమంత్రికి తెలియదన్నది నిన్నటి కురుపాం సభతో తేలిపోయిందన్నారు.

కురుపాం టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జ్ జగదీశ్వరి (Jagadeeswari) మాట్లాడుతూ అమ్మ ఒడి పథకం కురుపాంలో ప్రారంభించాడానికి అంత బిల్డప్ ఎందుకు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. నాలుగో విడత నిధులు విడుదల కోసం ఆర్భాటాలకు కోట్లు ఖర్చా? అని నిలదీశారు. జిల్లాలోని ఏనుగులు, పులులు సమస్య, రోడ్లు లేక అఘోరిస్తున్న గిరిజనుల గోడు కనిపించంలేదా జగన్ రెడ్డి?.. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, వైసీపీ పతనమైపోతుందన్నది అంతే వాస్తవమన్నారు. కురుపాం సభలో గిరిజన సంక్షేమ, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొరని మాట్లాడించకపోవటం శోచనీయమని సీనియర్ నేత విజయరామరాజు అన్నారు.

Updated Date - 2023-06-29T14:55:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising