ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చికిత్స పొందుతూ విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2023-11-29T00:14:00+05:30

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు, పాఠశాల సి బ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సీతంపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు, పాఠశాల సి బ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతంపేట మండ లం అక్కన్నగూడకు చెందిన నవదీప్‌(16) మల్లి గిరిజన బా లుర ఆశ్రమ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 17న పాఠశాల ఉపాధ్యాయులకు ఎవరికీ చెప్పకుండా బ యటకు వచ్చి ద్విచక్ర వాహనంపై దేవనాపురం వైపు వెళ్లి అదుపు తప్పి కింద పడ్డాడు. తలకు, శరీరానికి బలమైన గాయాలు కావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే శ్రీకాకుళం కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పది రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జిల్లా గిరిజన సంక్షేమశాఖ డీడీ మంగవేణి, పాఠశాల హెచ్‌ఎం పాలక నారాయుడు, అక్కన్న గూడ గ్రామానికి చేరుకొని మృతుని తండ్రి సవర శీను కుటుంబాన్ని ఓదార్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై జగదీష్‌ నాయుడు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-11-29T00:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising