ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Canada: ప్రతి ముప్పును తీవ్రంగా పరిగణిస్తాం.. ఖలిస్తానీ టెర్రరిస్ట్ వీడియోపై కెనడా

ABN, First Publish Date - 2023-11-10T13:17:43+05:30

Khalistan Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాదీ గురుపత్వంత్ సింగ్ పన్నూన్(Gurpatwant Singh Pannun) బెదిరింపులపై కెనడా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై కెనడా రవాణా శాఖ మంత్రి స్పందిస్తూ.. తాము ప్రతి ముప్పును తీవ్రంగా పరిగణిస్తామన్నారు. గత వారం పన్నూన్ రెండు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఒట్టావా: ఖలిస్తానీ ఉగ్రవాదీ(Khalistan Terrorist) గురుపత్వంత్ సింగ్ పన్నూన్(Gurpatwant Singh Pannun) బెదిరింపులపై కెనడా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై కెనడా రవాణా శాఖ మంత్రి స్పందిస్తూ.. తాము ప్రతి ముప్పును తీవ్రంగా పరిగణిస్తామన్నారు. గత వారం పన్నూన్ రెండు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతడు భారతీయులనే టార్గెట్ గా చేసుకుని చంపుతామని పరోక్షంగా బెదిరించిన వీడియో వైరల్ అయింది. పన్నూన్ వీడియోలో మాట్లాడుతూ... గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగే నవంబర్ 19న ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయాన్ని(IGI Airport) మూసివేస్తామన్నాడు.

ఆ రోజు ఎయిర్ ఇండియా ద్వారా ప్రయాణించడానికి ప్లాన్ చేసుకుంటున్న వ్యక్తుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లే అని బెదిరించాడు. "నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను ప్రత్యేకంగా కోరుతున్నాం. గ్లోబల్ దిగ్బంధనం ఉంటుంది" అని పన్నూన్ హెచ్చరించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయం మూసివేస్తామని, దాని పేరు మారుస్తామని కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. క్రికెట్ ప్రపంచ కప్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు అదేనని పరోక్షంగా మరో హెచ్చరిక చేశాడు. అక్టోబరు 10న, నిషేధిత US ఆధారిత సిక్కుల ఫర్ జస్టిస్ (SFJ) సంస్థకు చీఫ్‌గా ఉన్న పన్నూన్ ప్రధాని మోదీని(PM Modi) సైతం బెదిరించాడు.


ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నుండి మోదీ నేర్చుకోవాలని భారత్‌పై హమాస్ తరహా దాడి చేస్తామని బెదిరించాడు. ఖలిస్తానీ ఉగ్రవాదం నుండి భారత్ ముప్పు ఎదుర్కొంటున్న టైంలో పన్నూన్ వీడియో అప్పట్లో బయటకి వచ్చింది. ఇటీవల పంజాబ్‌లోని హిందూ దేవాలయాలు, సిక్కు నాయకులపై అనేక దాడులు జరిగాయని ఎస్ఎఫ్‌జే భారత ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. "పంజాబ్ నుండి పాలస్తీనా వరకు చట్టవిరుద్ధమైన ఆక్రమణలో ఉన్న వ్యక్తులపై ప్రత్యర్థులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తద్వారా రెండు వర్గాల మధ్య హింస చెలరేగుతోంది" అని అన్నాడు.ఇండియా పంజాబ్‌ను ఆక్రమించడం కొనసాగిస్తే తరువాత ఎదురయ్యే పరిణామాలకు ప్రధాని మోదీనే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించడం కలకలం రేపింది.

అమృత్‌సర్‌లో జన్మించిన పన్నూన్‌పై 2019లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కేసు నమోదు చేసింది. ఇలాంటి వీడియోలు రిలీజ్ చేసి తరచూ ప్రజాప్రతినిధులను, ప్రజలను భయపెడుతున్నాడు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పన్నూన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరి 3, 2021న NIA కోర్టు పన్నూన్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గతేడాది నవంబర్ 29న అతన్ని నేరస్థుడిగా ప్రకటించింది.

విమానానికి ముప్పు అంటూ బెదిరింపు వీడియోలు పంపడంపై కెనడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయల్ కెనడియన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కెనడాలో దాదాపు 7 లక్షల 70 వేల మంది సిక్కులు నివసిస్తున్నారు. వీరు ఆ దేశ జనాభాలో రెండు శాతంగా ఉన్నారు. జూన్ లో ఖలిస్తానీ ఉగ్రవాదీ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeepsingh Nijjar) హత్య తరువాత భారత్-కెనడాల మధ్య దౌత్యపర వివాదం చెలరేగింది. కెనడా.. భారత్ లోని దౌత్యవేత్తలను వెనక్కి రప్పించింది.

Updated Date - 2023-11-10T13:18:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising