ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: చంద్రయాన్-3 మరో మైలురాయి.. కళ్లన్నీ ఆగస్టు 23పైనే.. ఆ రోజు ఏం జరగబోతోంది?..

ABN, First Publish Date - 2023-08-09T16:48:24+05:30

చంద్రయాన్-3 అత్యంత కీలకమైన మరో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. చంద్రుని ఉపరితలానికి మరింత చేరువైంది. స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య విన్యాసానాన్ని 174 కి.మీ×1437కి.మీ.లకు తగ్గించినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) బుధవారం ప్రకటించింది.

చంద్రయాన్-3 మిషన్‌ అత్యంత కీలకమైన మరో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. మరోమారు స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య విన్యాసానాన్ని 174 కి.మీ×1437కి.మీ.లకు తగ్గించినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) బుధవారం ప్రకటించింది. మూడోసారి చేసిన ఈ ఆపరేషన్‌తో చంద్రుడి ఉపరితలానికి స్పేస్‌క్రాఫ్ట్ మరింత చేరువైందని వెల్లడించింది.

చంద్రుడి కక్ష్యకు సమీపాన ఇంధనాన్ని మండించడం ద్వారా తాజా ఆపరేషన్‌ను పూర్తి చేశామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇస్రోలోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (MOZ) ఈ విన్యాసానాన్ని విజయవంతంగా పూర్తిచేసిందని వివరించారు. ఫలితంగా స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య తగ్గిందని తెలిపారు. ఇక తదుపరి ఆపరేషన్‌ను ఆగస్టు 14, 2023న భారత కాలమానం ప్రకారం.. 11:30 నుంచి 12:30 మధ్య నిర్వహించనున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ఆపరేషన్‌లో స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువవుతుందని వెల్లడించారు.


కళ్లన్నీ ఆగస్టు 23పైనే..

చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి శాస్త్రవేత్తలు వరుసగా నిర్వహిస్తున్న ఆపరేషన్లు విజయవంతమవుతున్నాయి. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడానికి ముందు పలు ఆపరేషన్లను విజయంగా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించాక కూడా క్రమంగా కక్ష్యను తగ్గించుకుంటూ జాబిల్లిని సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో కళ్లన్నీ ఆగస్టు 23నే ఉన్నాయి. ఎందుకంటే మిషన్ అంతిమ లక్ష్యమైన ‘చంద్రుడి దక్షణ ధృవంపై ల్యాండింగ్’ ఘట్ట ఆగస్టు 23న సాయంత్రం 5:47 గంటలకు జరగనుంది. ఈ ఘట్టం విజయవంతమైతే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగవ దేశంగా భారత్ నిలుస్తుంది. అంతకుముందు అమెరికా, పూర్వ సోవియెట్ యూనియన్, చైనా ఈ జాబితాలో ఉన్నాయి. ఇస్రో సాధించబోయే ఈ మైలురాయి అంతరిక్ష అన్వేషణల్లో భారత్ ఎదుగుదలను చాటిచెప్పడమే కాకుండా చంద్రుడిని మరింతగా అవగతం చేసుకోవడానికి ఆస్కారముంటుందనే అంచనాలున్నాయి.

కాగా చంద్రయాన్-3 మిషన్‌ను జులై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు ప్రయోగించారు. చంద్రుడిపై సాప్ట్ ల్యాండింగ్ లక్ష్యం దిశగా ఈ మిషన్ వడివడిగా అడుగులేస్తోంది. ఈ మిషన్‌లో అత్యంత కీలకమైన చంద్రుడి కక్ష్యలోకి ఆగస్టు 5న ప్రవేశించిన విషయాలు తెలిసినవే.

Updated Date - 2023-08-09T17:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising