ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Joshimath crisis: 'రోప్ వే' సేవలు నిలిపివేత

ABN, First Publish Date - 2023-01-14T18:56:33+05:30

'మానవ తప్పదం'గా భావిస్తున్న జోషిమఠం సంక్షోభం ఉత్తరాంఖండ్‌లో మరింత ముదురుతోంది. చమోలీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోషిమఠ్: 'మానవ తప్పదం'గా భావిస్తున్న జోషిమఠం (Joshimath crisis) సంక్షోభం ఉత్తరాంఖండ్‌లో మరింత ముదురుతోంది. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ (Joshimath) నుంచి ఔలిని కలిపే రోప్‌వే (Ropeway) సేవలను శనివారం నుంచి నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ రోప్‌వే సేవలు నిలిపివేస్తున్నట్టు జిల్లా యంత్రాగం ప్రకటించింది. గత రెండు వారాలుగు వేలాది ఇళ్లు బీటలు వారిని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రోప్‌వే ఆపరేషన్ మేనేజర్ దినేష్ భట్ తెలిపారు. రోప్‌వే ఫ్లాట్‌ఫాం సమీపంలో గత ఆర్థరాత్రి కొన్ని పగుళ్లు కూడా కనిపించినట్టు ఆయన చెప్పారు. ముందు జాగ్రత్తగానే రోప్‌వే సేవలు ఆపుచేసినట్టు తెలిపారు. జోషిమఠ్ నుంచి ఔలి వరకూ 4.15 కిలోమీటర్ల రోప్‌వే ఇదని, టవర్ నంబర్ 1 సమీపంలో పగుళ్లు కనిపించడంతో సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు.

Updated Date - 2023-01-14T18:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising