ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur gunfight: మిలిటెంట్ గ్రూపుల మధ్య కాల్పులు..13 మంది మృతి

ABN, First Publish Date - 2023-12-04T19:04:35+05:30

మణిపూర్‌ లోని తేంగనౌపల్ జిల్లాలో రెండు మిలిటెంట్ గ్రూపుల మధ్య ఎదురెదురు కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. లెయితు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగి ఈ కాల్పుల్లో 13 మంది మరణించారు.

ఇంఫాల్: మణిపూర్‌ (Manipur)లోని తేంగనౌపల్ జిల్లాలో రెండు మిలిటెంట్ గ్రూపుల (millitants group) మధ్య ఎదురెదురు కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. లెయితు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగి ఈ కాల్పుల్లో 13 మంది మరణించారు. ఒక మిలిటెంట్ల గ్రూపు మయన్మార్ వెళ్తుండగా ఆ ప్రాంతంలో ఆధిపత్యం ఉన్న మరో మిలిటెంట్ గ్రూప్ వారిపై దాడి చేసినట్టు జిల్లా అధికారులు తెలిపారు. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలికి చేరుకుని 13 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని స్థానికులుగా అనుమానిస్తున్నప్పటికీ ఇంకా గుర్తించాల్సి ఉంది.


మొబైల్ ఇంటర్నెట్ సర్వీసుపై నిషేధం ఎత్తివేత

కాగా, హింసాత్మక సంఘటనలతో అట్టుడికిన మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులపై ఏడు నెలల క్రితం విధించిన నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారంనాడు ఎత్తివేసింది. డిసెంబర్ 18వ తేదీ వరకూ ఇది అమల్లో ఉంటుంది. అయితే, సరిహద్దు ప్రాంతంలోని 9 జిల్లాల్లో మాత్రం నిషేధం కొనసాగుతోంది.

Updated Date - 2023-12-04T19:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising