ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Saidharam Tej : గేమ్‌ ప్లాన్‌ మార్చిన తేజ్‌

ABN, First Publish Date - 2023-08-27T03:47:58+05:30

‘విరూపాక్ష’తో ఓ సూపర్‌ హిట్‌ అందుకొన్నాడు సాయిధరమ్‌ తేజ్‌. తన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమిది. అందుకే ఇక మీదట తన కెరీర్‌ని చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలనుకొంటున్నాడు. ఇప్పటికే ఒప్పుకొన్న కొన్ని కథల్ని సైతం పక్కన పెట్టాలన్న నిర్ణయానికి

‘విరూపాక్ష’తో ఓ సూపర్‌ హిట్‌ అందుకొన్నాడు సాయిధరమ్‌ తేజ్‌. తన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమిది. అందుకే ఇక మీదట తన కెరీర్‌ని చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలనుకొంటున్నాడు. ఇప్పటికే ఒప్పుకొన్న కొన్ని కథల్ని సైతం పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడట. అందులో భాగంగా జయంత్‌ అనే కొత్త దర్శకుడి కథని పూర్తిగా హోల్డ్‌లో పెట్టేశాడు. జయంత్‌ రెండేళ్ల క్రితమే తేజ్‌కి ఓ కథ చెప్పాడు. ‘విరూపాక్ష’ తరవాత దాన్నే పట్టాలెక్కించాలని ప్లాన్‌. కానీ మారిన సమీకరణాల వల్ల ఈ సినిమా చేయడం లేదు. మరి ‘విరూపాక్ష’ తరవాత తేజ్‌ కొత్త సినిమా ఎవరితో? ఎప్పుడు? అనే ప్రశ్నలు మెగా అభిమానుల్ని వెంటాడడం సహజం. వాటికీ సమాధానాలు దొరికేశాయి. సంపత్‌ నందితో తేజ్‌ ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. దీనికి ‘గాంజా శంకర్‌’ అనే పేరు ఖరారు చేశారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. సెప్టెంబరు చివరి వారంలో షూటింగ్‌ మొదలవుతుంది. సాయితేజ్‌ అక్టోబరు నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ చిత్రానికి భీమ్స్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 2024 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సినిమాలో మరో కథానాయిక కూడా ఉంది. ఆమె పేరు త్వరలోనే వెల్లడిస్తారు.

Updated Date - 2023-08-27T03:47:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising