ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియాధ్ వద్ద హైదరాబాదీలతో సహా అయిదుగురు భారతీయుల మృతి

ABN, First Publish Date - 2023-04-07T19:37:45+05:30

పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రా (మక్కా ప్రదక్షిణం) చేయడానికి వెళ్తూ మార్గమధ్య రోడ్డు ప్రమాదంలో ఒక హైదరాబాదీ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది.

కుమారుడితో షాహిద్‌; రషీద్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రా (మక్కా ప్రదక్షిణం) చేయడానికి వెళ్తూ మార్గమధ్య రోడ్డు ప్రమాదంలో ఒక హైదరాబాదీ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి పాపతో సహా గర్భవతి అయిన భార్యతో సహా మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాదరకమైన ఘటన గురువారం సౌదీ అరేబియాలోని రియాధ్ నగరం సమీపంలో చోటు చేసుకోంది.

రియాధ్ నగరంలోని సువైదీ ప్రాంతంలో నివసిస్తున్న హైదరబాద్ నగరానికి చెందిన 24 ఏళ్ళ అహ్మద్ అబ్దుల్ రషీద్, అతని భార్య గర్భవతి అయిన ఖన్సా, మూడేళ్ళ కూతురు మర్యంలు తమ పొరుగున ఉన్న రాజస్ధాన్‌కు చెందిన మొహమ్మద్ షాహీద్ ఖత్రీ అనే కుటుంబంతో కలిసి గురువారం రాత్రి మక్కాకు ఉమ్రా చేయడానికి వెళ్తుండగా ముజమియా అనే ప్రాంతం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పొరపాటున ఎదురుగా వచ్చిన ఒక కారు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకోనడంతో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా మరోకరు ఆసుపత్రిలో మరణించారు.

మరణించిన వారిలో రషీద్ భార్య ఖన్సా, కూతురు మర్యం మరియు షాహీద్ ఖత్రీ, అతని భార్య, నాలుగేళ్ళ కుమారుడు ఉన్నారు. ఖత్రీ భార్య సుమయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కాగా అహ్మద్ అబ్దుల్ రషీద్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు.

మృతులందరు తమ దారిలో సమక్రంగా ఓపికతో ప్రయాణిస్తుండగా, పొరపొటుగా ఎదురుగా వస్తున్న మరో కారు వేగంగా ఢీకొనడంతో వీరి కారు వెనకు వస్తున్న ఇతర కార్లు కూడ ఢీకొనడంతో వీరి కారు నుజ్జనుజ్జయినట్లుగా సమాచారం.

మృతులందరికి శుక్రవారం రియాధ్ నగరంలో అంతిమక్రియలు నిర్వహించినట్లుగా వారికి అధికారిక లాంఛనాలను పూర్తి చేయడంలో సహకరించిన తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు అబ్దుల్ జబ్బార్ తెలిపారు.

మృతుడు అహ్మద్ అబ్దుల్ రషీద్ తల్లిదండ్రులు హైదరాబాద్ నగరానికి చెందిన వారు. సుదీర్ఘ కాలం సౌదీలో ఉండి కొద్ది కాలం క్రితమే హైదరాబాద్‌కు తిరిగి వెళ్ళిపోయారు. అహ్మద్ రియాధ్ నగరంలోనే జన్మించి ఇక్కడే పెరిగారు.

Updated Date - 2023-04-07T19:37:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising