తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లారు. ఏపీలో మార్చిలోనే ఎన్నికలు జరగొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల సన్నద్ధత, సీట్ల సర్దుబాటుపై ఇద్దరు నేతలు సమీక్షించారు.