ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Malayalam Actress Nithya Sasi: 75 ఏళ్ల వృద్ధుడిపై బుల్లి తెర నటి వలపు వల.. సినిమా స్టోరీనే మించిపోయిందిగా..!

ABN, First Publish Date - 2023-07-28T22:39:14+05:30

ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కిన ఒక కేరళ టీవీ నటి గురించి సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ మలయాళ నటి పేరు నిత్య శశి. కేరళలోని పాతనమిట్ట ప్రాంతానికి చెందిన నిత్య మలయాళ టీవీ సీరియల్స్‌లో పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ గుర్తింపు తెచ్చిపెడుతున్న డబ్బు జల్సాలకు సరిపోలేదో.. ఏంటో.. ఈజీ మనీ కోసం తన స్నేహితుడు బిను అనే వ్యక్తితో కలిసి అడ్డదారులు తొక్కింది. తిరువనంతపురంలో ఉండే ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి కేరళ యూనివర్సిటీలో ఉద్యోగిగా ఉన్న ఒక 75 ఏళ్ల పెద్దాయనకు తన స్నేహితుడితో కలిసి నిత్య శశి వలేసింది.

భారత్‌లోని మెజారిటీ ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేసింది. పల్లెల నుంచి నగరాల దాకా ఇంటర్నెట్‌ను వినియోగించుకుని తమకు ఉన్న టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుని జీవితంలో రాణిస్తున్న వాళ్లు ఇటీవల కాలంలో చాలామంది వెలుగులోకి వచ్చారు. కానీ.. కొందరు మాత్రం అందుబాటులోకి వచ్చిన పరిజ్ఞానాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం, ఈజీ మనీ కోసం వాడుకుంటూ అడ్డదారులు తొక్కుతున్నారు. ఏదో ఒక రోజు చేసిన తప్పు బయటపడి సమాజం ముందు దోషులుగా నిలబడుతున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కిన ఒక కేరళ టీవీ నటి గురించి సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ మలయాళ నటి పేరు నిత్య శశి.


కేరళలోని పాతనమిట్ట ప్రాంతానికి చెందిన నిత్య మలయాళ టీవీ సీరియల్స్‌లో పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ గుర్తింపు తెచ్చిపెడుతున్న డబ్బు జల్సాలకు సరిపోలేదో.. ఏంటో.. ఈజీ మనీ కోసం తన స్నేహితుడు బిను అనే వ్యక్తితో కలిసి అడ్డదారులు తొక్కింది. తిరువనంతపురంలో ఉండే ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి కేరళ యూనివర్సిటీలో ఉద్యోగిగా ఉన్న ఒక 75 ఏళ్ల పెద్దాయనకు తన స్నేహితుడితో కలిసి నిత్య శశి వలేసింది. ఇల్లు అద్దెకు కావాలనే వంకతో ఆ సీనియర్ సిటిజన్‌తో నిత్య పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత ఇద్దరూ తరచుగా కలిసేవారు.

ఒక రోజు ఆ 75 ఏళ్ల వృద్ధుడిని నగ్నంగా చేసి మగువ మత్తులో ముంచెత్తి.. ఇద్దరూ కలిసి నగ్నంగా ఫొటోలు తీసుకుందామని చెప్పి నిత్య వీడియోలు, ఫొటోలు తీసింది. ఒంటి మీద నూలు పోగు లేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని నిత్య బెదిరించింది. అలా పోస్ట్ చేయకుండా ఉండాలంటే రూ.25 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. పలుమార్లు బెదిరించడంతో పరువు పోతుందనే భయంతో బాధితుడు రూ.11 లక్షల వరకూ నటి నిత్య శశికి ఇచ్చాడు. ఆ తర్వాత కూడా బిను, నిత్య కాల్ చేసి మిగిలిన డబ్బు కావాలని డిమాండ్ చేయడంతో జూలై 18న సదరు వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిత్య శశి, బిను కలిసి గతంలో కూడా ఇలాంటి పాడు పనులకు పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. నిత్య, బినును పోలీసులు ఎలా అరెస్ట్ చేశారంటే.. ఆ మిగిలిన డబ్బు కూడా ఇస్తానని.. ఇంటికి రావాలని ఆ 75 ఏళ్ల వృద్ధుడు నిత్యకు కాల్ చేశాడు. నిత్య, బిను కలిసి ఇంటికి వెళ్లారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - 2023-07-28T22:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising