ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Marriage: ఈ పెళ్లిని నేను ఒప్పుకోనంటూ.. వివాహమయిన కొద్ది రోజులకే అడ్డం తిరిగిన యువతి.. ఆమె చెప్తున్న కారణం వింటే..!

ABN, First Publish Date - 2023-09-04T16:28:19+05:30

వేదమంత్రాలు, మూడుముళ్లు, ఏడడుగులు, బంధుమిత్రుల ఆశీర్వాదాలు ఇన్నింటి మధ్య పండుగను మించి వెలిగిపోయేది పెళ్లి వేడుక. అయితే ఓ మహిళ మాత్రం నాకు జరిగిన పెళ్లి అసలు పెళ్లే కాదు అని అంటోంది. వేదమంత్రాల సాక్షిగా జరిగిన వివాహాన్ని నేను ఒప్పుకోనంటూ..

వేదమంత్రాలు, మూడుముళ్లు, ఏడడుగులు, బంధుమిత్రుల ఆశీర్వాదాలు ఇన్నింటి మధ్య పండుగను మించి వెలిగిపోయేది పెళ్లి వేడుక. అయితే ఓ మహిళ మాత్రం నాకు జరిగిన పెళ్లి అసలు పెళ్లే కాదు అని అంటోంది. వేదమంత్రాల సాక్షిగా జరిగిన వివాహాన్ని నేను ఒప్పుకోనంటూ ఏకంగా కోర్డు ముందే చెప్పుకొచ్చింది. తన భార్య చేసిన పనికి పాపం ఆ భర్త గుండె నిండా బాధతో మీరే న్యాయం చెయ్యాలంటూ కోర్టును వేడుకుంటున్నాడు. ఈ విచిత్ర సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం భోపాల్ ఫ్యామిలీ కోర్డులో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఓ జంట దాదాపు 8నెలలుగా సహజీవనం(live in relationship) చేశారు. వారిద్దరూ అక్కడే ఉద్యోగాలు చేస్తుండటంతో సహజీవనం వారికి సమస్య కాలేదు. దాదాపు 8నెలల తరువాత వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నామనే అభిప్రాయం ఏర్పడ్డాక వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ వారికి ఇరు కుటుంబాల నుండి అంగీకారం వచ్చే సూచనలు కనిపించలేదు, పైపెచ్చు వారి ఉద్యోగ బాధ్యతల కారణంగా కూడా వారు అందరికీ పెళ్ళి విషయం చెప్పలేకపోయారు . దీంతో వారిద్దరూ రహస్యంగా పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి తగ్గట్టే ఆర్యసమాజ్ మందిర్ లో వేదమంత్రాల సాక్షిగా సాంప్రదాయ బద్దంగా పెళ్లిచేసుకున్నారు. పెళ్లైన తరువాత ఆ అమ్మాయి MTech చేయడానికి బెంగళూరు(Bengaluru) వెళ్ళింది. ఆమె భర్త ప్రతిరోజూ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇలా నెలరోజులు గడిచిన తరువాత ఒకరోజు ఆమె భర్త ఆమెకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏమయ్యిందో ఏమోనని అతను కంగారు పడ్డాడు. తనకు తెలిసినవారికి ఆమె అడ్రస్ చెప్పి ఆమె గురించి కనుక్కోమని అతను అడిగాడు. అతను చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లిన వారికి ఆమె కనిపించలేదు. అక్కడ ఖాళీ చేసి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని వారు అతనికి తెలియజేశారు.

Shocking: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..? అప్పుడే పుట్టిన బిడ్డను ఆరో అంతస్తు పైనుంచి కింద పడేసిందో తల్లి..!



పోన్ ఎత్తకుండా, ఉండాల్సిన చోట ఉండకుండా ఎక్కడికెళ్లిందో, ఏమయ్యిందోనని అతను భయపడిపోయాడు. వెంటనే భోపాల్ లో ఉన్న ఆమె బంధువుల ఇంటికి వెళ్ళి ఆమె గురించి ఆరా తీశాడు. ఆమె బెంగుళూరులోనే ఉద్యోగంలో చేరినట్టు బంధువులు అతనికి తెలిపారు. దీంతో అతను ఆమెను కలవడానికి బెంగుళూరు వెళ్లాడు. బెంగుళూరులో అతని భార్య అతన్ని చూడటానికి, అతనితో మాట్లాడటానికి నిరాకరించింది. అసలు అతను తనకు తెలీదంటూ అందరి ముందు చెప్పింది. కానీ అతను తమ మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్ళి ఫోటోలు అందరికీ చూపించాడు. ఆమె వాటిని కొట్టిపడేసింది. దీంతో అతను కోర్డు మెట్లెక్కాడు. జరిగినదంతా వివరించి తనకు న్యాయం చేయాలని కోరాడు. పెళ్లి ఫోటోలు, మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి కోర్డువారు ఆమెను ప్రశ్నించగా తనకు మద్యం తాగించి మత్తులో ఉండగా పెళ్లి చేసి ఉంటారని, అసలు తనకు పెళ్లి జరిగినట్టు గుర్తులేదని ఆమె చెప్పుకొచ్చింది. అతను తనను మోసపూరితంగా వివాహం చేసుకున్నందుకు అతనిమీద కేసు పెట్టవచ్చు కానీ నేను వివాదం చేయదల్చుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే అతను చూపించిన ఆధారాలు అతను చెప్పిన విషయాలు వింటే అతని మాటలు నిజమేనని అనిపిస్తోందని కోర్టువారు అంటున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది.

Shocking: మీ ఇంట్లోంచి ఏదో పాడు వాసన వస్తోందంటూ పక్కింటి వాళ్ల నుంచి ఫోన్.. హడావిడిగా వచ్చి తలుపులు తీసి చూస్తే..!


Updated Date - 2023-09-04T16:28:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising