ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajasthan Deepika: సీమా, అంజూ తరహాలోనే మరో ఘటన.. భర్త, పిల్లల్ని వదిలేసి ప్రియుడితో విదేశాలకు జంప్

ABN, First Publish Date - 2023-08-15T19:02:23+05:30

ప్రేమించిన వ్యక్తల కోసం సీమా, అంజూ తమ కుటుంబాలను వదిలేసి.. బార్డర్ దాటిన విషయం తెలిసిందే. పబ్జీ ద్వారా పరిచయమైన ప్రియుడి కోసం సీమా హైదర్ తన పిల్లలతో సహా భారత్‌కి వస్తే.

ప్రేమించిన వ్యక్తల కోసం సీమా, అంజూ తమ కుటుంబాలను వదిలేసి.. బార్డర్ దాటిన విషయం తెలిసిందే. పబ్జీ ద్వారా పరిచయమైన ప్రియుడి కోసం సీమా హైదర్ తన పిల్లలతో సహా భారత్‌కి వస్తే.. ఫేస్‌బుక్‌లో కలిసిన వ్యక్తి కోసం భర్త, పిల్లల్ని వదిలేసి అంజూ అటు పాకిస్తాన్‌కి వెళ్లిపోయింది. ఇప్పుడు ఓ మహిళ కూడా అదే పని చేసింది. ఓ యువకుడితో ప్రేమలో పడిన ఆమె.. తన భర్త, పిల్లల్ని వదిలేసి విదేశాలకు వెళ్లిపోయింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని స్థానికులు లవ్ జిహాద్‌గా పేర్కొంటున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..


రాజస్థాన్‌లోని డూంగర్‌పూర్‌ జిల్లా భౌమయీ గ్రామంలో దీపిక అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటోంది. దీపిక భర్త ముంబైలో పని చేస్తున్నాడు. తనకు సెలవు దొరికినప్పుడల్లా.. భర్త గ్రామానికి వచ్చి వెళ్తుంటాడు. అయితే.. భర్త లేని సమయంలో దీపిక ఆయనకు తెలియకుండా వైద్య చికిత్స పేరుతో గుజరాత్, ఉదయ్‌పూర్ ప్రాంతాలకు వెళ్తుండేది. గత జులై 10వ తేదీ కూడా చికిత్స పేరుతో గుజరాత్ వెళ్లింది. అంతే.. ఇక అప్పటి నుంచి ఆమె తిరిగి రాలేదు. గుజరాత్‌కి వెళ్లిన తర్వాత దీపిక తన భర్తకు వాట్సాప్ కాల్ చేసి, అతని గుండె బద్దలయ్యే విషయాన్ని చెప్పింది. ‘‘నాతో నువ్వు సంతోషంగా లేవు, అందుకే నీకు దూరంగా వెళ్లిపోతున్నా’’ అని చెప్పి వాట్సాప్ కాల్ కట్ చేసింది. ఈ మాటలు విన్నాక ఖంగుతిన్న భర్త.. ముంబైలో పనులన్నీ వదిలేసి, గ్రామానికి చేరుకున్నాడు.

గ్రామంలోని ఇంటికెళ్లి చూస్తే.. ఇంట్లో దీపిక లేదు. అలాగే.. విలువైన నగలు, నగదు కూడా మాయమయ్యాయి. పిల్లల్ని మాత్రం ఇంట్లోనే వదిలేసి దీపిక వెళ్లిపోయింది. దీంతో.. ఆమె భర్త వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకి కొన్ని కీలక విషయాలు తెలిశాయి. ప్రస్తుతం ఆమె ఇండియాలో లేదన్న విషయంపై స్పష్టత వచ్చింది. ఓ యువకుడితో కలిసి విదేశాలకు వెళ్లినట్టు తేలింది. తన ప్రియుడితో కలిసి దీపిక దిగిన ఫోటోలు సైతం పోలీసులకు లభ్యమయ్యాయి. ఫోటోలు ఆమె బుర్ఖా ధరించి ఉండటంతో.. బహుశా కువైట్ లేదా ఏ ఇతర అరబ్ దేశానికి వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు.

Updated Date - 2023-08-15T19:02:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising