ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy : డిసెంబరులోనే అసెంబ్లీ ఎన్నికలు

ABN, First Publish Date - 2023-09-13T03:41:20+05:30

తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరులోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏప్రిల్‌, మేలో ఎన్నికలు జరగవచ్చంటూ

తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయి

మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నారు

సెప్టెంబరు 17 సమైక్యత దినమని ఎక్కడ ఉంది?

80 వేల పుస్తకాలు చదివిన వారు చెప్పాలి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరులోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏప్రిల్‌, మేలో ఎన్నికలు జరగవచ్చంటూ మంత్రి కేటీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. సెప్టెంబరు 17 సమైక్యతా దినమని ఏ పుస్తకంలో ఉందో 80 వేల పుస్తకాలు చదివిన సీఎం కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏ ముఖం పెట్టుకుని సమైక్యత దినం నిర్వహిస్తారని కేసీఆర్‌పై మండిపడ్డారు. ఎంఐఎం మోచేతి నీళ్లు తాగుతూ, కారు స్టీరింగ్‌ను వారి చేతిలో పెట్టారన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌ ముక్తి దివ్‌సను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, ఇక్కడ ఎంఐఎంతో స్నేహం ఉంది కాబట్టే కాంగ్రెస్‌ ఆ కార్యక్రమాన్ని చేయడం లేదని విమర్శించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విమోచన దినోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.

Updated Date - 2023-09-13T03:41:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising