Kishan Reddy : డిసెంబరులోనే అసెంబ్లీ ఎన్నికలు
ABN, First Publish Date - 2023-09-13T03:41:20+05:30
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం డిసెంబరులోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఏప్రిల్, మేలో ఎన్నికలు జరగవచ్చంటూ
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి
మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నారు
సెప్టెంబరు 17 సమైక్యత దినమని ఎక్కడ ఉంది?
80 వేల పుస్తకాలు చదివిన వారు చెప్పాలి: కిషన్రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం డిసెంబరులోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఏప్రిల్, మేలో ఎన్నికలు జరగవచ్చంటూ మంత్రి కేటీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. సెప్టెంబరు 17 సమైక్యతా దినమని ఏ పుస్తకంలో ఉందో 80 వేల పుస్తకాలు చదివిన సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ముఖం పెట్టుకుని సమైక్యత దినం నిర్వహిస్తారని కేసీఆర్పై మండిపడ్డారు. ఎంఐఎం మోచేతి నీళ్లు తాగుతూ, కారు స్టీరింగ్ను వారి చేతిలో పెట్టారన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ ముక్తి దివ్సను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, ఇక్కడ ఎంఐఎంతో స్నేహం ఉంది కాబట్టే కాంగ్రెస్ ఆ కార్యక్రమాన్ని చేయడం లేదని విమర్శించారు. పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విమోచన దినోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
Updated Date - 2023-09-13T03:41:20+05:30 IST