కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రగతి భవన్‌ చేరిన ఎమ్మెల్సీ కవిత

ABN, First Publish Date - 2023-12-03T12:25:42+05:30

తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

ప్రగతి భవన్‌ చేరిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఆర్ఎస్‌ వెనుకంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే ఫలితాల ట్రెండ్ కనిపిస్తోంది. కౌంటింగ్‌ ప్రక్రియ సాగుతున్న వేళ ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ చేరుకున్నారు. ఫలితాల సరళిని సీఎం కేసీఆర్‌ వీక్షిస్తున్నారు. కుటుంబ సభ్యుతలో కలిసి ఫలితాలను గమనిస్తున్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు,నాయకులు ప్రగతి భవన్‌కు చేరుకుంటున్నారు. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు..ఈసారి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ సాధించే సీట్లు ఎన్ని అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.

Updated Date - 2023-12-03T12:25:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising