దేవుడి తోడు.. అంటేనే పైసలు!
ABN, First Publish Date - 2023-11-29T04:41:10+05:30
ఓటర్లు డబ్బు తీసుకొని కూడా తమకు ఓటు వేయకపోతే? ఈ ఆలోచనతో పార్టీ శ్రేణులు ఇప్పుడు ఓటర్లతో ‘ఒట్లు’ కూడా పెట్టిస్తున్నాయి.
మహిళలతో ఒట్టు వేయించిన ఎంపీటీసీ
రంగారెడ్డి జిల్లా చీలాపూర్లో ఘటన
ఓటర్లు డబ్బు తీసుకొని కూడా తమకు ఓటు వేయకపోతే? ఈ ఆలోచనతో పార్టీ శ్రేణులు ఇప్పుడు ఓటర్లతో ‘ఒట్లు’ కూడా పెట్టిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎ్స ఎంపీటీసీ ఒకరు బాజాప్తాగా జనాలతో ఇలాగే ఒట్టు వేయించి మరీ డబ్బులిచ్చారు. పూడూరు మండలం చీలాపూర్ గ్రామంలో ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి మంగళవారం మధ్యాహ్నం తన ఇంటికి మహిళా ఓటర్లను పిలిపించుకున్నారు. వారి ఎదుట దేవుడి పటాన్ని పెట్టి.. ‘దేవుడి తోడు.. కారు గుర్తుకే ఓటేస్తా’ అని ఆ మహిళలతో ప్రమాణం చేయించి.. తలా రూ.1000 ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మా రింది. కొందరు మహిళలు మాత్రం.. డబ్బులెందుకు తీసుకోవాలి? మీకే ఓటు ఎందుకు వేయాలి? అంటూ ఆయన ఎదుటే అభ్యంతరం వ్యక్తం చేసి తీసుకోకుండానే వెళ్లిపోయినట్లు తెలిసింది. కాగా.. ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన యాప్ ద్వారా కొందరు వ్యక్తులు ఎంపీటీసీ రామకృష్ణారెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఎంపీటీసీని పోలీస్ స్టేషన్కు తరలించి కేసునమోదు చేసినట్లు ఎస్ఐ గిరి తెలిపారు.
పూడూరు
Updated Date - 2023-11-29T04:41:11+05:30 IST