ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దేవుడి తోడు.. అంటేనే పైసలు!

ABN, First Publish Date - 2023-11-29T04:41:10+05:30

ఓటర్లు డబ్బు తీసుకొని కూడా తమకు ఓటు వేయకపోతే? ఈ ఆలోచనతో పార్టీ శ్రేణులు ఇప్పుడు ఓటర్లతో ‘ఒట్లు’ కూడా పెట్టిస్తున్నాయి.

మహిళలతో ఒట్టు వేయించిన ఎంపీటీసీ

రంగారెడ్డి జిల్లా చీలాపూర్‌లో ఘటన

టర్లు డబ్బు తీసుకొని కూడా తమకు ఓటు వేయకపోతే? ఈ ఆలోచనతో పార్టీ శ్రేణులు ఇప్పుడు ఓటర్లతో ‘ఒట్లు’ కూడా పెట్టిస్తున్నాయి. వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలో బీఆర్‌ఎ్‌స ఎంపీటీసీ ఒకరు బాజాప్తాగా జనాలతో ఇలాగే ఒట్టు వేయించి మరీ డబ్బులిచ్చారు. పూడూరు మండలం చీలాపూర్‌ గ్రామంలో ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి మంగళవారం మధ్యాహ్నం తన ఇంటికి మహిళా ఓటర్లను పిలిపించుకున్నారు. వారి ఎదుట దేవుడి పటాన్ని పెట్టి.. ‘దేవుడి తోడు.. కారు గుర్తుకే ఓటేస్తా’ అని ఆ మహిళలతో ప్రమాణం చేయించి.. తలా రూ.1000 ఇచ్చారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మా రింది. కొందరు మహిళలు మాత్రం.. డబ్బులెందుకు తీసుకోవాలి? మీకే ఓటు ఎందుకు వేయాలి? అంటూ ఆయన ఎదుటే అభ్యంతరం వ్యక్తం చేసి తీసుకోకుండానే వెళ్లిపోయినట్లు తెలిసింది. కాగా.. ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసిన యాప్‌ ద్వారా కొందరు వ్యక్తులు ఎంపీటీసీ రామకృష్ణారెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఎంపీటీసీని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు.

పూడూరు

Updated Date - 2023-11-29T04:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising