సీనియర్ జర్నలిస్ట్ పసునూరు శ్రీధర్బాబుకు డాక్టరేట్
ABN, First Publish Date - 2023-04-01T23:52:32+05:30
‘‘రోల్ ఆఫ్ టెలివిజన్ న్యూస్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్’’ అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ పసునూరు శ్రీధర్ బాబు చేసిన పరిశోధనకు గాను పీహెచ్డీ ప్రదానం చేసినట్లు నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ‘‘రోల్ ఆఫ్ టెలివిజన్ న్యూస్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్’’ అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ పసునూరు శ్రీధర్ బాబు చేసిన పరిశోధనకు గాను పీహెచ్డీ ప్రదానం చేసినట్లు నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం ప్రకటించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టెలివిజన్ న్యూస్ మాధ్యమం బలమైన పాత్ర పోషించిందని, భావజాల వ్యాప్తిని భావోద్వేగాలతో పాటు ప్రజలకు విస్తృతంగా చేరవేసిన 24 గంటల వార్తా చానళ్ల రాష్ట్ర సాధన స్వప్నాన్ని వేగంగా సాకారం చేయడంలో దోహదపడ్డాయని శ్రీధర్బాబు తన పరిశోధనలో వెల్లడించారు. తెలంగాణ యూనివర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ పర్యవేక్షణలో శ్రీధర్బాబు ఈ పరిశోధన చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ఉద్యమాలు-టీవీ మాధ్యమానికి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను ఆయన తన పరిశోధన గ్రంధంలో లోతుగా చర్చించారని ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్, తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ సుధీర్కు మార్ తెలిపారు. కవిగా సుపరిచితులైన శ్రీధర్బాబు ప్రస్తుతం బీబీసీ న్యూస్లో పనిచేస్తున్నారు.
Updated Date - 2023-04-01T23:52:32+05:30 IST