టీటీడీ సభ్యుడిగా రాంరెడ్డి నియామకం గర్వకారణం
ABN, First Publish Date - 2023-08-29T00:25:36+05:30
టీటీడీ పాలకమండలి సభ్యుడిగా హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి ఎన్నికకావడం న్యాయ వాదులకు గర్వకారణమని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాంకుమార్, జూనియుర్ సివిల్ జడ్జి మారుతీప్రసాద్ అన్నారు.
హుజూర్నగర్, ఆగస్టు 28: టీటీడీ పాలకమండలి సభ్యుడిగా హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి ఎన్నికకావడం న్యాయ వాదులకు గర్వకారణమని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాంకుమార్, జూనియుర్ సివిల్ జడ్జి మారుతీప్రసాద్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామిరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ భక్తుల మనోభావాలు గాయపడకుండా ఉన్నతమైన సేవలు అందిస్తూ భగవంతుడి ఆశీస్సులు పొందాలన్నారు. కాలువ శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో న్యాయవాదులు, ఏజీపీలు, ఏపీపీలు, పోలీసులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, పలువురు రాంరెడ్డిని సన్మానించారు. సన్మానించిన వారిలో పట్టణ ప్రముఖులు అల్లం ప్రభాకర్రెడ్డి, ఈడ్పుగంటి సుబ్బారావు, యరగాని నాగన్నగౌడ్, సాముల జైపాల్రెడ్డి, నారపరాజు శ్రీనివాసరావు, ఎంపీపీ గూడెపు శ్రీను, గిరిబాబు, నట్టె సత్యనారాయణ, నరేందర్గౌడ్, జక్కుల నాగేశ్వరావు, రవికుమార్, నాగార్జున, కృష్ణయ్య, గోపాలకృష్ణ, వీరయ్య, శ్రీనివా్సరెడ్డి, సైదులు ఉన్నారు.
Updated Date - 2023-08-29T00:25:36+05:30 IST