హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి ఐదేళ్ల జైలు
ABN, First Publish Date - 2023-11-29T00:03:55+05:30
ఓ రైతుపై హత్యాయత్నం కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నం కోర్టు న్యాయాధికారి శంకర్శ్రీదేవీ మంగళవారం తీర్పు వెల్లడించారు.
యాచారం, నవంబరు 28: ఓ రైతుపై హత్యాయత్నం కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నం కోర్టు న్యాయాధికారి శంకర్శ్రీదేవీ మంగళవారం తీర్పు వెల్లడించారు. గడ్డమల్లాయగూడకు చెందిన రైతు ఆర్ల శ్రీశైలం తన టమాట పంటను జంగయ్యకు చెందిన పశువులు మేశాయని అతడిపై శ్రీశైలం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సురే్షబాబు దర్యాప్తు చేసి వివరాలను కోర్టుకు సమర్పించారు. న్యాయాధికారి శ్రీశైలానికి ఐదేళ్ల జైలు, 5వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Updated Date - 2023-11-29T00:03:56+05:30 IST