ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
ABN, First Publish Date - 2023-08-19T23:21:18+05:30
ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ రూరల్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున బ్యాంకాక్ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు ఎలక్ర్టికల్ (డీసీపవర్ సప్లై మెషీన్) డివైజ్లో 510 గ్రాముల బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ప్రయాణికుడి వద్ద బంగారానికి సంబంధించిన ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకుని బంగారాన్ని సీజ్ చేశారు. బంగారం విలువ దాదాపు రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2023-08-19T23:21:18+05:30 IST