పోస్టాఫీసుల్లో జాతీయ జెండాల విక్రయం
ABN, First Publish Date - 2023-08-03T03:59:34+05:30
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాల్లో జాతీయ జెండాల విక్రయాలను ప్రారంభించినట్టు తపాలా శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాల్లో జాతీయ జెండాల విక్రయాలను ప్రారంభించినట్టు తపాలా శాఖ అధికారులు తెలిపారు. స్వాతంత్య్ర దినం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేందుకు వీలుగా అందరికీ జెండాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. ఒక్కో జెండా రూ.25 చొప్పున విక్రయిస్తున్నట్టు తెలిపారు.
Updated Date - 2023-08-03T03:59:34+05:30 IST