బాధిత కుటుంబానికి మాజీ మంత్రి ఆర్థిక సాయం
ABN, Publish Date - Jan 14 , 2024 | 12:03 AM
మండలంలోని గలగల గ్రామంలో మూడురోజుల క్రితం టీడీపీ కార్యకర్త ఉచ్చవగారి వన్నూరుస్వామి అనారోగ్యంతో మృతి చెందడంతో శనివారం సాయంత్రం ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పరామర్శించారు.
గుమ్మఘట్ట, జనవరి 13: మండలంలోని గలగల గ్రామంలో మూడురోజుల క్రితం టీడీపీ కార్యకర్త ఉచ్చవగారి వన్నూరుస్వామి అనారోగ్యంతో మృతి చెందడంతో శనివారం సాయంత్రం ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పరామర్శించారు. కుటుంబ పెద్ద కోల్పోయి కష్టాల్లో ఉన్న పిల్లలను ఎనటీఆర్ ట్రస్టు ద్వారా చదివించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి రూ. 15 వేలు ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబానికి మనోధైర్యం నింపారు. క్లస్టర్ ఇనచార్జి కాలవ సన్నన్న, కేపీదొడ్డి నాగరాజు, దాసరి రాజు, రాజ్కుమార్, లోకేష్, బంజోబ పాల్గొన్నారు.
Updated Date - Jan 14 , 2024 | 12:03 AM