ఓపీఎస్ను పునరుద్ధరించాలి
ABN, Publish Date - Jan 09 , 2024 | 12:06 AM
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు నూతన పెన్షన పద్ధతిని రద్దుచేసి, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు.
గుంతకల్లు, జనవరి8: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు నూతన పెన్షన పద్ధతిని రద్దుచేసి, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. గుంతకల్లు రైల్వే పరిధిలో ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఓపీఎస్ పునరుద్ధరణకు ధర్నాలు నిర్వహించారు. స్థానిక డీఆర్ఎం కార్యాలయంతోపాటు వివిధ బ్రాంచల వద్ద సంఘ్ నాయకులు శిబిరాలను ఏర్పాటుచేసి ఆందోళన చేపట్టారు. ఆందోళనా కార్యక్రమంలో మల్లికార్జున, జీఎన ప్రకాశబాబు, నాగమణి, టీ కృష్ణ, బీఎస్ ప్రకాశబాబు, బీ నెట్టికంటయ్య, చంద్రశేఖరరావు, మహమ్మద్ రియాజుద్దీన తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2024 | 12:06 AM