ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కీచక హెచ్‌ఎం అరెస్టు...సస్పెన్షన్‌

ABN, Publish Date - Jan 30 , 2024 | 02:44 AM

అభం, శుభం తెలియని చిన్నారులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడులో సోమవారం వెలుగులోకి వచ్చింది.

అత్తిలి, జనవరి 29 : అభం, శుభం తెలియని చిన్నారులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడులో సోమవారం వెలుగులోకి వచ్చింది. బల్లిపాడు నంబర్‌-2 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మోపిదేవి శ్రీనివాస్‌ నెహ్రూ కొంత కాలంగా 4, 5 తరగతులు చదువుతున్న 9 మంది విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. నాల్గో తరగతి విద్యార్థిని సోమవారం కుటుంబీకులకు విషయం తెలపడంతో స్థానికులు పాఠశాలను ముట్టడించారు. ఎంఈవో రమేష్‌ విచారణ చేపట్టడంతో పలువురు విద్యార్థినులు తమపై కూడా అసభ్యంగా ప్రవర్తించాడని తెలపగా... ఆయన నివేదికను డీఈవోకు పంపారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు అత్తిలి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రాస్తారోకో చేశారు. డీఎస్పీ శరత్‌రాజ్‌కుమార్‌ సంఘటనా స్థలికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడిపై పోక్సో, అట్రాసిటీ తదితర కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఉపాధ్యాయుడు శ్రీనివా్‌సను సస్పెండ్‌ చేస్తూ డీఈవో వెంకటరమణ ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈవో రమేష్‌ తెలిపారు.

Updated Date - Jan 30 , 2024 | 02:44 AM

Advertising
Advertising