ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మాంబేడులో జల్లికట్టు జోరు

ABN, Publish Date - Jan 22 , 2024 | 12:27 AM

సంక్రాంతి ముగిసినా జల్లికట్టు జోరు తగ్గలేదు. వెదురుకుప్పం మండలం మాంబేడులో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు.

గిత్తతో సై అంటే సై అంటూ..

సంక్రాంతి ముగిసినా జల్లికట్టు జోరు తగ్గలేదు. వెదురుకుప్పం మండలం మాంబేడులో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించడంతో అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ గిత్తల కొమ్ములకు రంగులు దిద్దారు. బహుమతులుగా ఉపయోగించే పట్టీలను రాజకీయ ప్రముఖులు, వివిధ దేవుళ్లు, గిత్తల యజమానుల కుటుంబీకుల ఫొటోలతో కట్టారు. కొన్నింటికి వస్త్రాలనూ కప్పి అల్లిలోకి వదిలారు. ఇలా దూసుకొస్తున్న ఎద్దులను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ ప్రయత్నంలో కొందరు కింద పడి గాయపడ్డారు. పట్టీలను సొంతం చేసుకునే క్రమంలో గిత్తలతో కుస్తీ పడ్డారు. పట్టీలను చేజిక్కించుకున్న యువకులు కేరింతలు కొట్టారు. మిద్దెలు, గోడలు, చెట్లను ఎక్కి జనం జల్లికట్టును వీక్షిస్తూ.. చప్పట్లు, ఈలలతో హోరెత్తించారు. జల్లికట్టుతో గ్రామం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా టీడీపీ తరపున అన్నప్రసాద వితరణను ఆ పార్టీ ఎన్‌ఆర్‌ఐ కో-ఆర్డినేటరు గురుసాల కిషన్‌చంద్‌ ప్రారంభించారు.

- వెదురుకుప్పం

Updated Date - Jan 22 , 2024 | 12:27 AM

Advertising
Advertising