సంవత్సరాది సందడి
ABN, Publish Date - Jan 01 , 2024 | 12:51 AM
ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శ్రీవారి ఆలయం పుష్పాలంకార శోభితమైంది.ఐదు టన్నుల సంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్తో ఆలయంలో వైకుంఠద్వారాన్ని, బంగారు వాకిలిని, బలిపీఠాన్ని, ధ్వజస్తంభాన్ని సౌందర్యవంతంగా అలంకరించారు.
పుష్పాలంకార శోభితం..శ్రీవారి ఆలయం
తిరుమల, డిసెంబరు31(ఆంధ్రజ్యోతి): ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా శ్రీవారి ఆలయం పుష్పాలంకార శోభితమైంది.ఐదు టన్నుల సంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్తో ఆలయంలో వైకుంఠద్వారాన్ని, బంగారు వాకిలిని, బలిపీఠాన్ని, ధ్వజస్తంభాన్ని సౌందర్యవంతంగా అలంకరించారు. నెదర్లాండ్,తైవాన్,బ్యాంకాక్ దేశాలనుంచి తెప్పించిన తులిప్స్ కట్ప్లవర్స్ను, జెయింట్ అర్కిట్స్, ప్రోటివర్ లాంటి అరుదైన పుష్పాలను అలంకరణలో వినియోగించారు.బెంగళూరుకు చెందిన సునీత పుష్పాలంకరణకు అవసరమైన విరాళం అందజేశారు. టీటీడీ గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు 200మంది నిపుణులు ఈ అలంకరణ పనుల్లో పాల్గొన్నారు.
Updated Date - Jan 01 , 2024 | 12:51 AM