ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం

ABN, Publish Date - Jan 07 , 2024 | 01:41 AM

జగన్‌ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం

రావులపాలెం, జనవరి 6: జగన్‌ పాలనలో బీసీలు అణచివేతకు గురయ్యారని, జగన్‌పాలనకు స్వస్తి పలికి ప్రజాపాలనను తీసుకువచ్చే చంద్రబాబును అధికారంలోకి తీసుకురా వాలని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు అండగా ఉండేది టీడీపేనన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. బీసీలకు జరిగే అన్యాయాలను వివరించి వారిలో చైతన్యం తీసుకురావడానికి టీడీపీ జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందన్నారు. జగన్‌ ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ప్రచార ఆర్భాటం తప్ప నిధులు ఇచ్చి వారికి అండగా నిలబడింది లేదన్నారు. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి వైసీపీని తరిమికొట్టాలన్నారు. సమావేశంలో గుత్తుల పట్టాభిరామారావు, కాసా సాగర్‌, దొమ్మేటి శ్రీను, కోట వెంకటేశ్వరరావు, కడలి లచ్చన్న, అత్తిలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 01:41 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising