ముగ్గురు సీఐలు బదిలీ
ABN, Publish Date - Jan 09 , 2024 | 12:57 AM
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా తూర్పుగోదావరి నుంచి సీఐలు బదిలీ అయ్యారు.
రాజమహేంద్రవరం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా తూర్పుగోదావరి నుంచి ఇద్దరు సీఐలు బదిలీ అయ్యారు. బొమ్మూరు సీఐ విజయ్ కుమార్, టూటౌన్ సీఐ టి.గణేశ్ని విజయవాడ కమిషనరేట్లో రిపోర్టు చేయాలని ఏలూరు రేంజ్ డీఐజీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కడియం సీఐ పి.బి.జె. తిలక్ను పశ్చిమగోదావరి జిల్లా స్పెషల్ బ్రాంచ్కు బదిలీ చేశారు.విజయవాడ దిశ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ కె. వాసవిని తూర్పుగోదావరి జిల్లా దిశ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.
Updated Date - Jan 09 , 2024 | 12:57 AM