మతసామరస్యానికి ప్రతీక ఉరుస్ షరీఫ్ గంధోత్సవం : ఎమ్మెల్యే రాజప్ప
ABN, Publish Date - Jan 21 , 2024 | 12:35 AM
పెద్దాపురం, జనవరి 20: మతసామరస్యానికి ప్రతీక ఉరుస్ షరీఫ్ గంధోత్స వం అని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన పార్టీ పెద్దాపురం నియోజ కవర్గ ఇన్చార్జి తుమ్మల బాబు అన్నారు. శనివారం పట్ణణ శివారు పాతపెద్దాపురంలో ఉన్న హజరత్ షేక్ మదీనా పాచ్ఛా ఔళియా దర్గా వద్ద ఉరుస్ గంధోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొనగా ముస్లిం మతపెద్దలు, దర్గా నిర్వాహకులు మహ్మ ద్ లాయక్ ఆలీ తదితరులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు
పెద్దాపురం, జనవరి 20: మతసామరస్యానికి ప్రతీక ఉరుస్ షరీఫ్ గంధోత్స వం అని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన పార్టీ పెద్దాపురం నియోజ కవర్గ ఇన్చార్జి తుమ్మల బాబు అన్నారు. శనివారం పట్ణణ శివారు పాతపెద్దాపురంలో ఉన్న హజరత్ షేక్ మదీనా పాచ్ఛా ఔళియా దర్గా వద్ద ఉరుస్ గంధోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొనగా ముస్లిం మతపెద్దలు, దర్గా నిర్వాహకులు మహ్మ ద్ లాయక్ ఆలీ తదితరులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గంధాన్ని దర్గా వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సమాధికి గంధాన్ని పూసి తమ భక్తి ప్రవర్తులను చాటుకున్నారు. ఈ సందర్భంగా మిమిక్రీ, మ్యాజిక్షో అలరించాయి. ఖురాన్ ఖానీ, ఖవ్వాళీ, ఫాతేహా ఖానీ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీమంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజాసూరిబాబురాజు, మహా రాణీ సత్రం మాజీ చైర్మన్ తూతిక రాజు, అరీఫ్ ఆలీ, ఇర్షాద్ ఆలీ పాల్గొన్నారు.
Updated Date - Jan 21 , 2024 | 12:35 AM