పలు రైళ్లు రద్దు
ABN, Publish Date - Jan 01 , 2024 | 12:22 AM
విజయవాడ సమీపాన రైలు ట్రాక్పై రోలింగ్ కారిడార్ బ్లాక్ ప్రోగ్రాం, పలు భద్రతా ఏర్పాట్లలో భాగంగా జనవరి 1 నుంచి ఈ సెక్షన్లో ఉదయ్, సింహాద్రి ఎక్స్ప్రెస్లతో పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే సీనియర్ ఏటీఎం చార్జి ఏ.సురేష్రెడ్డి రైల్వే అధికారులకు ఆదే శాలు జారీ చేశారు.
సామర్లకోట, డిసెంబరు 31: విజయవాడ సమీపాన రైలు ట్రాక్పై రోలింగ్ కారిడార్ బ్లాక్ ప్రోగ్రాం, పలు భద్రతా ఏర్పాట్లలో భాగంగా జనవరి 1 నుంచి ఈ సెక్షన్లో ఉదయ్, సింహాద్రి ఎక్స్ప్రెస్లతో పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే సీనియర్ ఏటీఎం చార్జి ఏ.సురేష్రెడ్డి రైల్వే అధికారులకు ఆదే శాలు జారీ చేశారు. 17239 నంబరు గల గుం టూరు-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే సింహాద్రి ఎక్స్ప్రెస్ జనవరి 1 నుంచి జనవరి 14 వరకూ రద్దు చేశారు. 17240 నంబరు గల విశాఖపట్నం-గుంటూరు మధ్య రాక పోకలు సాగించే సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు జనవరి 1 నుంచి 15 వరకూ రద్దు చేశారు. 22701 నంబరు గల విశాఖ- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలు జనవరి 1,2,3,5,6,8,9,10,12,13 తేదీలలో రద్దు చేశారు. 22702 నంబరు గల విజయవాడ-విశాఖ మధ్య రాకపోకలు సాగించే ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలు జనవరి 1,2,3,5,6,8,9,10,12,13 తేదీలలో రద్దు చేశారు.
Updated Date - Jan 01 , 2024 | 12:22 AM