ఎన్నికల సమయంలో డీఎస్సీ నోటిఫికేషనా?
ABN, Publish Date - Feb 02 , 2024 | 11:05 PM
నిరుద్యోగ యువత తనను గద్దె దించుతుందన్న భయంతోనే డీ ఎస్సీ నోటిఫికేషన్తో ఓట్ల రాజకీయానికి తెర తీశారని టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నాయకులు ఆరోపించారు.
రాజంపేట, ఫిబ్రవరి 2: నిరుద్యోగ యువత తనను గద్దె దించుతుందన్న భయంతోనే డీ ఎస్సీ నోటిఫికేషన్తో ఓట్ల రాజకీయానికి తెర తీశారని టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నాయకులు ఆరోపించారు. శుక్రవారం పట్టణం లోని డిగ్రీ కళాశాలలో టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నాయకులు జగన్రెడ్డి తీరును ఎండ గడుతూ చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు అధ్యక్షుడు పోలి శివకుమార్ మా ట్లాడుతూ ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ వేస్తానని హామీ ఇచ్చి గద్దె నెక్కిన జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం లో నిలువునా మోసపోయిన నిరుద్యోగ యువత జగన్కు తగిన బుద్ధి చెబుతారన్నారు. తెలుగు యువత పార్లమెంటు అధికార ప్రతినిధి జగదాభి పాండురాజు మాట్లాడుతూ నిరుద్యోగ యువత ను దృష్టి మళ్లించేందుకే ఫేక్ డీఎస్సీ ప్రకటించా రని, యువత జగన్మోహన్రెడ్డి మాయలో పడొద్దని కోరారు. తెలుగు యువత నేతలు సు హేల్, షేక్ షఫీఉల్లా, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హరికృష్ణ, రాజశేఖర్, ఆది, లక్ష్మణ్, శ్రీనివాసులు, వంశీకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Feb 02 , 2024 | 11:06 PM