మన్నూరు ఈద్గాకు ‘గంటా’ మరో 10 లక్షలు విరాళం
ABN, Publish Date - Jan 28 , 2024 | 11:07 PM
పట్టణంలోని మన్నూరు ఈద్గా అభివృద్ధికి టీడీపీ నేత గంటా నరహరి మరో 10లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మన్నూరు ఈద్గా కమిటీ సభ్యులు ఆదివారం గంటాను కలువగా తొలి విడతగా ఈద్గాకు 10 లక్షలు విరాళం అందజేశారు.
రాజంపేట, జనవరి 28: పట్టణంలోని మన్నూరు ఈద్గా అభివృద్ధికి టీడీపీ నేత గంటా నరహరి మరో 10లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మన్నూరు ఈద్గా కమిటీ సభ్యులు ఆదివారం గంటాను కలువగా తొలి విడతగా ఈద్గాకు 10 లక్షలు విరాళం అందజేశారు. ఆ నిధులు సరిపోనందున మరో 10లక్షల రూపా యల నిధులను వెంటనే ఇవ్వనున్నట్లు తెలియ జేశా రు. వారం రోజుల్లో ఈద్గా పనులు పూర్తి చేయాలని ఈద్గా సభ్యులను కోరారు. ఈద్గా కమిటీ సభ్యులు జిలానీ పాల్గొన్నారు.
జనసేన నేత భేటీ
జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఏపీఎస్ఆర్టీసీ మాజీ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు గంటా నర హరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజం పేట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి టికెట్టు ఇచ్చినా అందరూ కలిసికట్టుగా కృషి చేయడానికి తనవంతు కృషి చేస్తామని తెలిపారు. గంటాను కలిసిన వారిలో సిద్దవటం టీడీపీ నాయకులు నాగమునిరెడ్డి, వెంకట సుబ్బయ్య, రైల్వేకోడూరు టీడీపీ నాయకులు అజయ్బాబు, యువనాయకులు డాక్టర్అఖిలేష్, రాజంపేట పార్లమెంటు మహిళా ఉపాధ్యక్షు రా లు వాణి, రాజంపేట మండల పార్టీ అధ్యక్షులు గన్నె సుబ్బనరసయ్యనాయుడు, ఒంటిమిట్ట మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, రాజంపేట సీనియర్ టీడీపీ నేతలు రమణయ్యనాయుడు, ఆర్యవైశ్య సంఘ నాయకు లు సునీల్ తదితరులు పాల్గొన్నారు.
తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్తో
గంటా నరహరితో ఆదివారంరాత్రి తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ భేటీ అయ్యారు. రాజం పేటలోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్న వేమన సతీష్కు నరహరి బొకే అందజేసి శాలు వా కప్పి సన్మానించారు. అనంతరం ఏకాంతం గా వారు చర్చించుకున్నారు. ఓ.జి.రాజశేఖర్రెడ్డి, తెలుగు యువత నాయకులు పిడికిటి సంతోష్ కుమార్, సీనియర్ నాయకుడు రమణయ్య నాయుడు, తెలుగు యువత నాయకుడు చం ద్రబాబు నాయుడు, దూదేకుల సంఘ నాయ కుడు ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 28 , 2024 | 11:07 PM