ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YCP: కృష్ణాజిల్లాలో వైసీపీకి గట్టి షాక్

ABN, Publish Date - Feb 01 , 2024 | 09:55 AM

కృష్ణాజిల్లా: గుడివాడ, గుడ్లవల్లేరు మండలంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. కౌతవరం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. గుడివాడ తెలుగుదేశం ఇన్చార్జ్ వెనిగండ్ల రాము వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

కృష్ణాజిల్లా: గుడివాడ, గుడ్లవల్లేరు మండలంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. కౌతవరం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. గుడివాడ తెలుగుదేశం ఇన్చార్జ్ వెనిగండ్ల రాము వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొడాలి నాని ప్రవర్తనతో గుడివాడ నియోజకవర్గ ప్రజలతో పాటు, సొంత పార్టీ కార్యకర్తలే విసిగిపోయి ఉన్నారని, వ్యవస్థలను అవహేళన చేస్తున్న పనికిమాలిన ఎమ్మెల్యే నానిను, రాజకీయాల నుండి తరిమికొడదామని పిలుపిచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలన్న, ప్రజలన్న, ఆఖరికి సొంత పార్టీ కార్యకర్తలన్న లెక్కలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దల స్వార్థానికి అడ్డువచ్చిన ప్రతి ఒక్కరిని ఇబ్బందుల పాలు చేస్తారన్నారు. టీడీపీలో చేరిన వారిలో పెద్ద ఎత్తున బీసీ కుటుంబాలు ఉండడం సంతోషకరమని అన్నారు. కాగా వెనిగండ్ల రాము రాకతో గౌతవరం గ్రామం కోలాహలంగా మారింది.

Updated Date - Feb 01 , 2024 | 11:41 AM

Advertising
Advertising