సర్పంచ్ల డిమాండ్లు ఆమోదించాలి
ABN, Publish Date - Jan 08 , 2024 | 01:24 AM
గ్రామీణ ప్రజలకు న్యాయం చేయాలన్న సర్పంచ్ల 16 డిమాండ్లు ఆమోదించకపోతే రాజకీయాలు, పార్టీలకతీతంగా సర్పంచ్ల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ జాతీయ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.
లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: వైవీబీ రాజేంద్రప్రసాద్
ఉయ్యూరు, జనవరి 7: గ్రామీణ ప్రజలకు న్యాయం చేయాలన్న సర్పంచ్ల 16 డిమాండ్లు ఆమోదించకపోతే రాజకీయాలు, పార్టీలకతీతంగా సర్పంచ్ల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ జాతీయ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. ఇటీవల మంగళగిరిలో పంచాయతీరాజ్ చాంబర్, సర్పం చ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు విజయవంతం కావడంపై సంఘం ఆధ్వర్యలో ఉయ్యూరులోని వైవీబీ నివాసంలో ఆయనను సంఘం కమిటీ నాయకులు సత్కరించారు. సర్పంచ్ల సంఘం ఉమ్మడిజిల్లా అధ్యక్షుడు గోలి వసంతకుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి గళ్లా తిమోతి, సంఘం నాయకులు కాగిత గోపాలరావు, మండలి ఉదయభాస్కర్, ముప్పనేని రవి ప్రసాద్, పంచర్ల సురేశ్, వంపుగడల ఫ్రాన్సిస్లు పాల్గొన్నారు.
Updated Date - Jan 08 , 2024 | 01:24 AM