ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

ABN, Publish Date - Jan 09 , 2024 | 12:43 AM

మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే ఏ కుటుంబం అయినా సంతోషంగా ఉంటుందని సెంట్రల్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.

వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో

బొండా ఉమామహేశ్వరరావు

గుణదల, జనవరి 8: మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే ఏ కుటుంబం అయినా సంతోషంగా ఉంటుందని సెంట్రల్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే పథకాల జాబితాతో కూడిన భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచార కార్యక్రమం స్థానిక ఒకటవ డివిజన్లో సోమవారం ప్రారంభించారు. ఒకటవ డివిజన్‌ పరిధిలోని హనుమాన్‌ నగర్‌ పపులమిల్లు సెంటర్‌ నుంచి పాదయాత్రగా బయలు దేరి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. మహిళలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాం లో జరిగిన అభివృద్ధే తప్ప వైసీపీ పాలనలో ఒకటవ డివిజన్లో జరిగిన అభివృద్ధి శూన్యమని చెప్పారు. టీడీపీ హయాంలో వచ్చిన కరెంటు బిల్లుతో పోల్చుకుంటే వైసీపీ పాలనలో నాల్గురెట్లు ఎక్కువ వస్తుంద న్న విషయం అందరూ గ్రహించాలన్నారు. సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో చేసి పేదల్ని ధనికులుగా చేయగల సత్తా ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందని అభిప్రాయపడ్డారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, డివిజన్‌ అధ్యక్షుడు కొమ్మినేని సురేష్‌, పిన్నమనేని రితీష్‌, భార్గవ్‌, ఎస్‌కె జాన్‌ వలి, వేములపల్లి పెదబాబు, మాదాల సత్య, దివ్య, కోటేశ్వరి, జనసేన నాయకులు గోపాల్‌, కెంబూరి శ్రీను, సత్య పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:43 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising