మల్లన్న సేవలో నారా లోకేశ్ దంపతులు
ABN, Publish Date - Feb 02 , 2024 | 12:27 AM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను గురువారం ఉదయం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దంపతులు కుమారుడు దేవాన్ష్తో కలిసి దర్శించుకున్నారు.
శ్రీశైలం, ఫిబ్రవరి 1: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను గురువారం ఉదయం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దంపతులు కుమారుడు దేవాన్ష్తో కలిసి దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సున్నిపెంట హెలిప్యాడ్కు చేరున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక కాన్వాయ్లో నారా లోకేశ్ దంపతులు సాక్షిగపతి ఆలయం చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకుని అక్కడి నుంచి క్షేత్ర పరిధిలోని బయలు వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనార్థం ప్రధానాలయం రాజగోపురం వద్ద నారా లోకేశ్, నారా బ్రాహ్మణిలకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం రత్నగర్భ గణపతిని దర్శించుకుని మల్లికార్జున స్వామివారికి అభిషేకం నిర్వహించుకున్నారు. తరువాత భ్రమరాంబికా దేవి అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన జరిపించారు. ఆలయ అధికారులు నారా లోకేశ్ దంపతులకు స్వామి, అమ్మవార్ల చిత్రపటం, ప్రసాదాలు అందజేసి సత్కరించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలు బుడ్డా రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, భూమా అఖిలప్రియ, ఎన్ఎండీ ఫరూక్, గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి, టీడీపీ నాయకులు భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, భూమా జగత్ విఖ్యాతరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మీడియా కోఆర్టినేటర్ వెంకటరాముడు తదితరులు లోకేశ్కు స్వాగతం పలికారు.
Updated Date - Feb 02 , 2024 | 12:27 AM