రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN, Publish Date - Jan 05 , 2024 | 12:13 AM
మండలంలో ముసలాయ చెరువు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న మోటారుసైకిళ్లు ఢీకొనడంతో నక్క శ్రీను (48) అక్కడికక్కడే మృతి చెందారు.
బేతంచెర్ల, జనవరి 4: మండలంలో ముసలాయ చెరువు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న మోటారుసైకిళ్లు ఢీకొనడంతో నక్క శ్రీను (48) అక్కడికక్కడే మృతి చెందారు. ఏఎస్ఐ లింగమయ్య గురువారం తెలిపిన వివరాలివీ.. పట్టణంలోని సంజీవనగర్కు నక్క శ్రీను ముసలాయ చెరువు గ్రామానికి తన బంధువులను కలిసి తిరిగి బుధవారం రాత్రి మోటారు సైకిల్పై వస్తుండగా.. ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ ఢీకొట్టింది. మోటారు సైకిల్ పై నుంచి నక్క శ్రీను కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనుకు భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
Updated Date - Jan 05 , 2024 | 12:13 AM