పండగరోజు అంగన్వాడీల పస్తు
ABN, Publish Date - Jan 17 , 2024 | 12:16 AM
హిందువుల పండగలో అతి ముఖ్యమైన సంక్రాంతి నాడు అంగన్వాడీ సిబ్బంది పస్తులుండి ప్రభుత్వం వైఖరిపై నిరసన తెలిపారు.
సరుబుజ్జిలి: హిందువుల పండగలో అతి ముఖ్యమైన సంక్రాంతి నాడు అంగన్వాడీ సిబ్బంది పస్తులుండి ప్రభుత్వం వైఖరిపై నిరసన తెలిపారు. సోమవారం సరుబుజ్జిలి మండల అంగన్వాడీల సంఘం అధ్యక్షురాలు కూన జ్యోతి ఆధ్వర్యంలో గోనెపాడు గ్రామంలో జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఖాళీ విస్తరాకులతో నిరసన తెలిపారు.
Updated Date - Jan 17 , 2024 | 12:16 AM