చంద్రబాబుతోనే పంచాయతీల బలోపేతం
ABN, Publish Date - Jan 03 , 2024 | 11:52 PM
టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంతి అయితేనే పంచాయతీలు బలోపేతం అవుతాయని శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా సర్పం చ్ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్ అన్నారు.
- జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్
శ్రీకాకుళం, (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంతి అయితేనే పంచాయతీలు బలోపేతం అవుతాయని శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా సర్పం చ్ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్ అన్నారు. మంగళగిరిలో ఓ ప్రైవేట్ కన్వెన్ష న్ హాల్లో బుధవారం ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా జరిగిన సర్పంచ్లు, ఎంపీటీసీల రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛమైన న్యాయమైన పరిపాలన సామర్థ్యం ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని, మేనిఫెస్టోలో స్పష్టమైన ఎజెండా పొందు పరిచారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిరంకుశ పాలన వల్ల పంచాయతీరాజ్ వ్యవ స్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ప్రతినిధు లు టీడీపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర పీఆర్ చాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, రాష్ట్రంలో అన్ని జిల్లాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Updated Date - Jan 03 , 2024 | 11:52 PM