టీడీపీ-జనసేన విజయమే లక్ష్యం
ABN, Publish Date - Jan 03 , 2024 | 11:27 PM
కేటీ రోడ్డు ఎస్బీఐ జంక్షన్ వద్ద జనసేన పార్టీ కార్యాలయాన్ని బుధవారం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వి.దుర్గారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు తిప్పాన దుర్యోధన రెడ్డి, బైపల్లి ఈశ్వరరావు ప్రారంభించారు.
జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం
పలాస: కేటీ రోడ్డు ఎస్బీఐ జంక్షన్ వద్ద జనసేన పార్టీ కార్యాలయాన్ని బుధవారం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వి.దుర్గారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు తిప్పాన దుర్యోధన రెడ్డి, బైపల్లి ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. కిడ్నీ వ్యాధులను ప్రపంచానికి చూపించి ఉద్దానం ప్రాంత మార్గదర్శకుడిగా పవన్ కల్యాణ్ నిలిచారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేసి విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దాసరి రాజు, పేడాడ రామ్మోహ నరావు, ఎన్ని రాజు, ప్రవీణ్కుమార్, కె.గోపాలరావు, దిలీప్కుమార్ పాణిగ్రాహి పాల్గొన్నారు.
Updated Date - Jan 03 , 2024 | 11:27 PM