షర్మిల రాకతో శ్రేణుల్లో ఉత్సాహం
ABN, Publish Date - Jan 05 , 2024 | 11:09 PM
కాంగ్రెస్ పార్టీలోకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల చేరికతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని, ఆమె రాకను స్వాగతిస్తున్నామని డీసీసీ అధ్య క్షుడు పేడాడ పరమేశ్వరరావు అన్నారు.
టెక్కలి: కాంగ్రెస్ పార్టీలోకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల చేరికతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని, ఆమె రాకను స్వాగతిస్తున్నామని డీసీసీ అధ్య క్షుడు పేడాడ పరమేశ్వరరావు అన్నారు. శుక్రవారం నౌపడా ఆర్ఎస్ సమీపంలో పార్టీ కార్యా లయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు నాయకత్వంలో పార్టీ పునర్నిర్మాణం జరిగి బలం పుంజుకుందన్నారు. ఉత్తరాంధ్ర ఇన్చార్జి రాకేష్రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైందని, షర్మిల రాకతో మరింతగా ప్రజల మధ్యకు దూసుకుపోతుందని తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షుడు కోత మధు తదితరులు పాల్గొన్నారు.
జలుమూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కాంగ్రెస్లో చేరికతో నూతనోత్సాహం వచ్చి పార్టీ మరింత బలోపేతమైందని డీసీసీ కార్యవర్గ సభ్యుడు మామిడి సత్యనారాయణ అన్నారు. చల్లవానిపేటలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. షర్మిల రాకతో యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారన్నారు.
Updated Date - Jan 05 , 2024 | 11:09 PM