ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LK Advani - Bharat Ratna : ‘భారత రత్న’ అవార్డుకు ఎంపికైన ఎల్‌కే అద్వానీకి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు

ABN, Publish Date - Feb 03 , 2024 | 01:43 PM

దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారత రత్న’కు ఎంపికైన మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీపై అభినందనల వెల్లువ కురుస్తోంది. పలువురు రాజకీయ రంగ ప్రముఖులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కూడా స్పందించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’కు ఎంపికైన ఎల్‌కే అద్వానీకి ఆయన అభినందనలు తెలిపారు.

అమరావతి: దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారత రత్న’కు ఎంపికైన మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీపై అభినందనల వెల్లువ కురుస్తోంది. పలువురు రాజకీయ రంగ ప్రముఖులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కూడా స్పందించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’కు ఎంపికైన ఎల్‌కే అద్వానీకి ఆయన అభినందనలు తెలిపారు. అద్వానీ దేశం పట్ల అంకితభావం, ఆదర్శప్రాయ కృషి చేశారని అన్నారు. పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన అద్వానీ దేశానికి అసాధారణమైన సేవలను అందించారని, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని అన్నారు. ఆయన ఆప్యాయత స్వభావం ప్రతి ఒక్కరిపై చెరగని ముద్రవేస్తుందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. గతంతో అద్వానీతో దిగిన ఫొటోను చంద్రబాబు షేర్ చేశారు.

Updated Date - Feb 03 , 2024 | 01:43 PM

Advertising
Advertising