అందరి సహకారంతోనే సభ సక్సెస్
ABN, Publish Date - Jan 30 , 2024 | 11:40 PM
పత్తికొండలో జరిగిన రాకదలిరా బహిరంగసభ విజయవంతానికి కృషిచేసిన టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు.
పత్తికొండ, జనవరి 30 : పత్తికొండలో జరిగిన రాకదలిరా బహిరంగసభ విజయవంతానికి కృషిచేసిన టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. మంగళవారం పత్తికొండ కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలు పార్లమెంటరీ పరిధిలో రాకదలిరా కార్యక్రమానికి పార్టీ పత్తికొండను ఎంపిక చేయడంతో లక్షమందితో బారీబహిరంగసభ ఏర్పాటుచేయాలని బావించామన్నారు. ఇందుకోసం జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, ఇన్చార్జిలు మీనాక్షినాయుడు, తిక్కారెడ్డి, టీజీభరత్, కోట్లసుజాతమ్మ, జయనాగేశ్వరరెడ్డి, ఆకెపోగు ప్రబాకర్లతోపాటు విష్ణువర్దన్రెడ్డి తమవంతుసహకారాన్ని పూర్థిస్థాయిలో అందించారన్నారు. దీనికి తోడు టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయడంతో లక్షమందితో నిర్వహించాలనుకున్న బహిరంగసభకు లక్షన్నదాటి హాజరయ్యారని, అతిపెద్ద బహిరంగసభగా పత్తికొండ చరిత్రలో నిలిచిపోయిందని వివరించారు.
Updated Date - Jan 30 , 2024 | 11:40 PM