పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ABN, Publish Date - Jan 12 , 2024 | 12:22 AM
మండలంలోని గడసాం గ్రా మంలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. మృతుడు భార్య నారాయ ణమ్మ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మజ్జి అప్పలనా యుడు(47) ఈనెల 7వ తేదీన తన పొలంలో వేసుకున్న సోలార్ ప్లాంటు వద్దకు వెళ్లాడు. అక్కడ అదే గ్రామానికి చెందిన మజ్జి వెంకటేష్కు, అప్పల నాయుడుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సదరు వ్యక్తి అప్పలనాయుడుపై దాడి చేశాడు
దత్తిరాజేరు, జనవరి 11: మండలంలోని గడసాం గ్రా మంలో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. మృతుడు భార్య నారాయ ణమ్మ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మజ్జి అప్పలనా యుడు(47) ఈనెల 7వ తేదీన తన పొలంలో వేసుకున్న సోలార్ ప్లాంటు వద్దకు వెళ్లాడు. అక్కడ అదే గ్రామానికి చెందిన మజ్జి వెంకటేష్కు, అప్పల నాయుడుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సదరు వ్యక్తి అప్పలనాయుడుపై దాడి చేశాడు. అనంతరం 8వ తేదీ ఉదయం ఇంటి వద్ద కూడా ఇద్దరూ ఘర్షణ పడ్డా రు. దీనిపై పెదమానాపురం స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఇరువర్గాలను పోలీసు స్టేషన్కు పిలిచి మాట్లాడుతామని స్టేషన్ సిబ్బంది తెలిపారు. మూడు రోజులు గడు స్తున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురైన మజ్జి అప్పారావు గురువారం తన మిరపతోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే గజపతినగరం సీహెచ్సీకి తర లించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై పెదమానాపురం ఎస్ఐ శిరీషను వివరణ కోరగా స్టేషన్లో ఎవరూ లేరని, విజయవాడ బందోబస్తుకు వెళ్ల డంతో గురువారం స్టేషన్కు రావాలని సూచించామన్నారు. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలి పారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Updated Date - Jan 12 , 2024 | 12:22 AM