ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే

ABN, Publish Date - Jan 30 , 2024 | 11:58 PM

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ ప్రజల పక్షానే నిలబడుతుందని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు.

జొన్నవలస రచ్చబండలో ప్రజల సమస్యలు వింటున్న టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు

టీడీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే

ఈ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నాశనం

కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు

విజయనగరం రూరల్‌, జనవరి 30: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ ప్రజల పక్షానే నిలబడుతుందని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. టీడీపీ రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జొన్నవలస గ్రామంలో ఎంపీటీసీ పి.రాజేష్‌వర్మ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ టీడీపీ ఏర్పాటై నాలుగు దశాబ్దాలు దాటిందని, కొన్నేళ్లు ప్రతిపక్షంలో.. కొన్నేళ్లు అధికారంలో ఉందని, ఎప్పుడూ పేదరిక నిర్మూలన, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నడిచిందన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ పాలన లో అన్ని వ్యవస్థలూ నాశనమ య్యాయన్నారు. ధరలను కూడా నియంత్రించలేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జి అదితి గజపతిరాజు, నాయకులు ఐవీపీ రాజు, పి.రాజేష్‌వర్మ, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలోని 22, 23 డివిజన్ల పరిధిలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం కంది మురళీనాయుడు, కంది శమంతక మణి, గొల్లకోటి గురునాథ్‌, గొల్లకోటి శివ తదితరుల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జరిగింది. కాగా గాంధీజీ వర్థంతి పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Updated Date - Jan 30 , 2024 | 11:58 PM

Advertising
Advertising