యూజియా ఫార్మా ఐపీఓ సన్నాహాలు!
ABN, Publish Date - Jan 11 , 2024 | 03:25 AM
అరబిందో ఫార్మా అనుబంధ కంపెనీ యూజియా ఫార్మా స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూ జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యూజియాను విక్రయించాలని..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అరబిందో ఫార్మా అనుబంధ కంపెనీ యూజియా ఫార్మా స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూ జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యూజియాను విక్రయించాలని 2022లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో అరబిందో చర్చలు జరిపింది. కంపెనీ విలువపై భేదాభిప్రాయాలు తలెత్తడంతో అరబిందో ఫార్మా ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. తాజాగా పబ్లిక్ ఇష్యూకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మార్కెట్ సమాచారం. ఈ ఏడాదిలో రూ.4,500 కోట్ల వరకూ సమీకరణకు పబ్లిక్ ఇష్యూకు రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Updated Date - Jan 11 , 2024 | 03:25 AM