సెలెక్టర్లకు అంత ధైర్యం లేదు
ABN, Publish Date - Jan 09 , 2024 | 03:24 AM
అఫ్ఘాన్తో జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం రోహిత్, విరాట్ల ఎంపికపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా భిన్నంగా స్పందించాడు. ఏడాది కాలం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన వీరు...
న్యూఢిల్లీ: అఫ్ఘాన్తో జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం రోహిత్, విరాట్ల ఎంపికపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా భిన్నంగా స్పందించాడు. ఏడాది కాలం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన వీరు.. రాబోయే టీ20 వరల్డ్క్పలోనూ ఆడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒక్కరినే జట్టులోకి ఎంపిక చేసే ధైర్యం ఏ సెలెక్టర్కూ లేదని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు. ఇద్దరినీ పక్కనబెట్టడమో.. లేదా తీసుకోవడమో చేయాల్సిందేనని చెప్పాడు. మరోవైపు హార్దిక్, సూర్యకుమార్, రుతురాజ్ గాయాలతో బాధపడుతుండడం, శ్రేయా్సకు రెస్ట్ ఇవ్వడంతో ఇద్దరు సీనియర్లను జట్టులోకి తీసుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
Updated Date - Jan 09 , 2024 | 03:24 AM