ముంబైతో పోరుకు రెండు జట్లుగా వచ్చి..
ABN, Publish Date - Jan 07 , 2024 | 03:34 AM
రెండు దశాబ్దాలుగా బిహార్ క్రికెట్లో కొనసాగుతున్న వర్గపోరు ‘మైదానాని’కి పాకింది. ముంబైతో శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన రంజీట్రోఫీ మ్యాచ్ సందర్భంగా సంఘంలోని రెండు వర్గాల జట్లు ఆడేందుకు వచ్చాయి...
బిహార్ క్రికెట్లో బయటపడ్డ విభేదాలు
పట్నా: రెండు దశాబ్దాలుగా బిహార్ క్రికెట్లో కొనసాగుతున్న వర్గపోరు ‘మైదానాని’కి పాకింది. ముంబైతో శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన రంజీట్రోఫీ మ్యాచ్ సందర్భంగా సంఘంలోని రెండు వర్గాల జట్లు ఆడేందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు జట్లకు సంబంధించిన అధికారులు వాగ్వాదానికి దిగడంతోపాటు గొడవపడే దుస్థితికి పరిస్థితి దిగజారింది. బిహార్ క్రికెట్ సంఘంలో (బీసీఏ) ఒక వర్గానికి అధ్యక్షుడు రాకేశ్ తివారీ, మరో వర్గానికి కార్యదర్శి అమిత్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముంబై జట్టుతో పోరుకు రెండు వర్గాల జట్లు మైదానానికి రావడంతో..అక్కడున్నవారంతా షాక్ తిన్నారు. చర్చల అనంతరం అశుతోష్ అమన్ కెప్టెన్సీలోని రాకేశ్ తివారీ వర్గానికి చెందిన జట్టును ఆడేందుకు నిర్వాహకులు అనుమతించారు. దాంతో మ్యాచ్ ఆలస్యంగా ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది.
Updated Date - Jan 07 , 2024 | 06:52 AM