జీవితంలో మొదటి స్థానం భగవంతుడికి ఇవ్వాలి
ABN, Publish Date - Jan 17 , 2024 | 10:52 PM
మానవ జీవితంలో మొదటి స్థానం భగవంతుడికి ఇవ్వాలని గుడ్లైఫ్ మినిస్ర్టీ డైరెక్టర్ శ్యామ్గుంటి అన్నారు.
అయిజ, జనవరి 17: మానవ జీవితంలో మొదటి స్థానం భగవంతుడికి ఇవ్వాలని గుడ్లైఫ్ మినిస్ర్టీ డైరెక్టర్ శ్యామ్గుంటి అన్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా ఆయా చర్చిల్లో చిన్నారులకు వీబీఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం చివరి రోజు కావడంతో అయిజ పట్టణంలోని ఉప్పల రహదారిలో వేలాదిమంది బాలురు, బాలకలతో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన శ్యామ్గుంటి చిన్నారులను ఉద్దేశించి మాట్లాడారు. నిత్యం దేవుడిని స్మరిస్తే మంచి మార్గంలో నడిచేవిధంగా తీర్చిదిద్దుతాడని పేర్కొన్నారు. క్రమశిక్షణ, చదువు, సమాజం, పెద్దల పట్ల అనుసరించాల్సిన విధానం వస్తుందని తెలిపారు. అనంతరం దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, కంటి వైద్యం, ఉచిత కంప్యూటర్ శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు టాక్జాన్సన్, సైమన్, డేవిడ్, శ్యామ్బాబు, యుగంధర్, డేవిడ్, సుజిత్, రత్నాకర్, ఆయా గ్రామాల చిన్నారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 17 , 2024 | 10:52 PM