విద్యాసంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు
ABN, Publish Date - Jan 12 , 2024 | 12:19 AM
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ముంద స్తుగా విద్యాసంస్తల్లో సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు నిర్వహించా రు.
పెద్దపల్లి కల్చరల్, జనవరి 11 : సంక్రాంతి పండుగ నేపథ్యంలో ముంద స్తుగా విద్యాసంస్తల్లో సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు నిర్వహించా రు. ట్రినిటి బిఈడి, డిఈడి శిక్షణ కళాశాలలో ఘనంగా జరిగాయి. మున్సిపల్ చైర్ పర్సన్ మమతారెడ్డి, ప్రిన్సిపాల్స్ రెడ్డమ్మ, బుర్ర తిరుపతి, రజని, దిలీప్శర్మ, అధ్యాపకులు మధుకర్, గోపీనాధ్, తిరుపతి పాల్గొన్నారు. గాయత్రి విద్యానికేతన్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కరస్పాండెంట్ అల్లెంకి శ్రీనివాస్, రజని శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు.
గోదావరిఖనిలో..
కోల్సిటీటౌన్ : గోదావరిఖని పలు విద్యాసంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి విద్యాసంస్థలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. పాఠశాల డైరెక్టర్ మంజులా శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయులు, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రమేష్ నగర్లోని ఉషోదయ హైస్కూల్ ఆవరణలో ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల తోపాటు కన్సోలేషన్ బహుమతులు అందించారు. పాఠశాల కరస్పాండెంట్ కొత్త శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయులు ఎం.శ్రీలక్ష్మి, జె.భాగ్యలక్ష్మి, సిహెచ్ ఉష, కె. తిరుమల, బి.అరుణ తదితరులు పాల్గొన్నారు. విఠల్నగర్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. ప్రధానోపాధ్యాయులు బొంతల సతీష్, ఉపాధ్యాయులు ప్రవీణ్, సరళ, అరుణ, అనురాధ, సుభాష్, మనోహర్, నవేష్, సంగీత పాల్గొన్నారు. రాజలక్ష్మికాలనీలో మహిళా కమిటీ ఆధ్వర్యం లో నిర్వహించిన ముగ్గుల పోటీలు అలరించాయి. గెలుపొందిన మహిళల కు మాజీ కౌన్సిలర్ గాజుల రాజమల్లు బహుమతులు అందజేశారు. రాజ రాజేశ్వర సోఫా ఫ్యాక్టరీ సహకారంతో జరిగిన పోటీల్లో కాలనీవాసులు ఉర గోండ రమేష్, కె.పి.రాజ్కుమార్, దబ్బెట శంకర్, రమేష్, రవి, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2024 | 12:19 AM